ప్రాచీన ఆయుర్వేదంలో అశ్వగంధకు చాలా ప్రాముఖ్యత ఉంది. రోగనిరోధక శక్తి పెరగడానికి, ఆందోళన, కుంగుబాటు నివారించడానికి ఈ ఔషధం పనిచేస్తుందన్న పేరు ఉంది. కరోనా నివారణ లో అస్వ గంధ పాత్ర మీద 16 నెలల పాటు 100 సమావేశాలు జరిగిన ఒక ఒప్పందం కుదిరిందని ఏఐఐఏ డైరెక్టర్ తనూజ మనోజ్ నేసరి తెలిపారు.
‘‘మూడు నెలలపాటు ఒక గ్రూపులోని 1,000 మందికి అశ్వగంధ మాత్రలను అందిస్తాం. మరో వెయ్యి మందికి అశ్వగంధ తరహాలోనే ఉండే ప్లేసిబో(ప్రభావం లేని మందు) మాత్రలను అందిస్తాం. తాము ఏ మాత్రలను తీసుకుంటున్నామో ఇందులో పాల్గొన్న వారికే కాకుండా.. వారిని పరిశీలించే వైద్యులకు కూడా తెలియదు. వారంతా 500మిల్లీగ్రాముల మాత్రలను రోజుకు రెండు సార్లు చొప్పున తీసుకుంటారు. అనంతరం వీరి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తారు’’ అని తనూజ తెలిపారు.
ఈ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే అశ్వగంధ ఔషధానికి అంతర్జాతీయ గుర్తింపు రానుంది. ఈ వీడియో చూడండి…https://youtu.be/CVCFprvTRrU